Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లి సెంచరీ వృధా... పేక మేడలా కూలిన వికెట్లు... ఆసీస్ విజయం

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (21:21 IST)
కోహ్లీ చేసిన సెంచరీ వృధా అయింది. భారత్ బ్యాట్సమన్ల వికెట్లు పేకమేడలా కూలిపోవడంతో ఆసీస్ 32 పరుగుల తేడాతో భారత్ పైన మూడో వన్డేలో విజయం సాధించింది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే తడబడింది. 
 
ధావన్ కేవలం 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా ఎంతోసేపు నిలువలేకపోయాడు. అతడు 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. విరాట్ కోహ్లి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటం చూసి ఇక ఇండియా గెలుపు ఈజీనే అనుకున్నారు. ఐతే వచ్చినవారు వచ్చినట్లు వికెట్లు సమర్పించుకుంటూ వెళ్తుండటంతో భారత్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. రాయుడు 2 పరుగులు, ధోనీ 26 పరుగులు, జాదవ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు. 
 
కోహ్లి కూడా 38వ ఓవర్లో తన వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లి 123 పరుగులు చేయడంతో భారత్ జట్టు ఆ స్థితిలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఐతే ఆ తర్వాత వచ్చినవారు నిలకడగా రాణించలేకపోయారు. శంకర్ 32 పరుగులు, జడేజా 24 పరుగులు, కులదీప్ యాదవ్ 10 పరుగులు, మహ్మద్ సామి 8 పరుగులు చేశారు. మొత్తం 281 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీనితో ఆసీస్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments