Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లి సెంచరీ వృధా... పేక మేడలా కూలిన వికెట్లు... ఆసీస్ విజయం

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (21:21 IST)
కోహ్లీ చేసిన సెంచరీ వృధా అయింది. భారత్ బ్యాట్సమన్ల వికెట్లు పేకమేడలా కూలిపోవడంతో ఆసీస్ 32 పరుగుల తేడాతో భారత్ పైన మూడో వన్డేలో విజయం సాధించింది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే తడబడింది. 
 
ధావన్ కేవలం 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా ఎంతోసేపు నిలువలేకపోయాడు. అతడు 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. విరాట్ కోహ్లి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటం చూసి ఇక ఇండియా గెలుపు ఈజీనే అనుకున్నారు. ఐతే వచ్చినవారు వచ్చినట్లు వికెట్లు సమర్పించుకుంటూ వెళ్తుండటంతో భారత్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. రాయుడు 2 పరుగులు, ధోనీ 26 పరుగులు, జాదవ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు. 
 
కోహ్లి కూడా 38వ ఓవర్లో తన వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లి 123 పరుగులు చేయడంతో భారత్ జట్టు ఆ స్థితిలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఐతే ఆ తర్వాత వచ్చినవారు నిలకడగా రాణించలేకపోయారు. శంకర్ 32 పరుగులు, జడేజా 24 పరుగులు, కులదీప్ యాదవ్ 10 పరుగులు, మహ్మద్ సామి 8 పరుగులు చేశారు. మొత్తం 281 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీనితో ఆసీస్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments