Webdunia - Bharat's app for daily news and videos

Install App

7000 పరుగుల మైలురాయిని చేరిన రోహిత్ శర్మ.. కానీ గాయం వీడలేదు..

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (11:21 IST)
అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 7000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. కేవలం 137 ఇన్నింగ్స్‌లో హిట్ మ్యాన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. శుక్రవారం ఆసీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ. 2019లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన హిట్ మ్యాన్ ''ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌''గా నిలవడం తెలిసిందే. 
 
తాజాగా 7వేల పరుగుల మైలురాయి చేరుకున్న ఆటగాడిగా రోహిత్ నిలవడం ద్వారా క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా ఓపనర్ ఆమ్లా(147 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికార్డుని రోహిత్ తన పేరిట తిరగరాసుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో 7000 పరుగులు సాధించిన ఓపనర్ల జాబితాలో రోహిత్, ఆమ్లా తర్వాతటి స్థానాల్లో సచిన్ టెండుల్కర్(160 ఇన్నింగ్స్), దిల్షాన్(165) ఉన్నారు.
 
ఇదిలా ఉంటే..  ఓవైపు భారీ విజయంతో సంతోషంగా ఉన్న భారత అభిమానులకు ఆటగాళ్లను వరుసగా వెంటాడుతున్న గాయాలు కలవరపెడుతున్నాయి. తొలి వన్డేలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడి కంకషన్ తీసుకోగా.. తాజా మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, ధావన్ గాయాలకు గురయ్యారు. దీంతో బెంగళూరు వేదికగా జరిగే డిసైడర్ వన్డేలో ఈ ఓపెనింగ్ జోడీ బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

తర్వాతి కథనం
Show comments