Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ వన్డే : భారత్ విజయలక్ష్యం 243 రన్స్

ఐదో వన్డేల సిరీస్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ముంగిట ఆస్ట్రేలియా 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (18:08 IST)
ఐదో వన్డేల సిరీస్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ముంగిట ఆస్ట్రేలియా 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేశారు. 
 
కాగా, ఐదు వన్డేల సిరీస్‌లో 3-1 తేడాతో ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. నాల్గో వన్డేలో ఆసీస్ చేతిలో పరాజయం పొందిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో కనుక భారత జట్టు విజయం సాధిస్తే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. అలాగే, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించాలన్న కృతనిశ్చయంతో ఆస్ట్రేలియా ఉంది. 
 
అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడారు. ఫలితంగా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కుర్రోళ్లు డేవిడ్ వార్నర్ (53), ఫించ్ (32), స్మిత్ (16), హ్యాండ్స్ కాంబ్ (13), టీఎం హెడ్ (42), స్టాయినిస్ (46), ఎంఎస్ వేడ్ (20), జేపీ ఫాల్కనర్ (12), కూల్టర్-నీల్ డకౌట్ (0), కమిన్స్ నాటౌట్ చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, బుమ్రా 2, పాండ్యా 1, కేఎం జాదవ్ 1, అక్షర్ పటేల్ 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments