Webdunia - Bharat's app for daily news and videos

Install App

టచ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ : టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (08:44 IST)
భారత క్రికెట్ జట్టు ఓపెన్ రోహిత్ శర్మ టచ్‌లోకి వచ్చారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లలో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. దీంతో 2.1 ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. 
 
బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్మిత్ 57, మ్యాక్స్‌వెల్ 37, స్టోయినిస్ 41 పరుగులు (నాటౌట్) చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత 153 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 2.1 ఓవర్లు ఉండగానే చేరుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ కాగా మరో ఓపెనర్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ 38, హార్దిక్ పాండ్యా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
 
మరోవైపు, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్-ఏ లో శ్రీలంక-ఐర్లాండ్ పోటీ పడగా, శ్రీలంక 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే గ్రూప్‌లో నమీబియా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

తర్వాతి కథనం
Show comments