Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (09:53 IST)
భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో నుంచి మంటలు చెలరేగి కారు మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన ప్రాణాలతో బయపటపడ్డారు. కానీ, తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా రూర్కీ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడు. ఆయన డ్రైవింగ్ చేస్తూ ఢిల్లీకి వెళుతున్నాడు. డివైడర్‌ను డీకొట్టగానే ఒక్కసారిగా కారులో నుంచి మటలు చెలరేగాయి. దీంతో కారు డోరు అద్దాలు పగులగొట్టి కారులో నుంచి బయటకు దూకేశాడు. ప్రమాదం కారణంగా కారు పూర్తిగా దగ్ధమైపోయింది. 
 
ఈ ఘటనపై పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం స్థలానికి చేరుకుని పంత్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ మెరుగైన వైద్య సేవల కోసం డెహ్రూడూన్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments