Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఎఫెక్ట్ : పడిపోయిన కోహ్లీ ర్యాంక్

కొత్త పెళ్లికొడుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ పడిపోయింది. పెళ్లి కారణంగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరం కావడంతో ఆ ప్రభావం తన ర్యాంకుపై పడింది.

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (12:29 IST)
కొత్త పెళ్లికొడుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ పడిపోయింది. పెళ్లి కారణంగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరం కావడంతో ఆ ప్రభావం తన ర్యాంకుపై పడింది. ఫలితంగా మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారాడు. అదేసమయంలో మొదటి ర్యాంకును ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ కైవసం చేసుకున్నాడు. 
 
తాజాగా వెల్లడైన ఐసీసీ ర్యాంకుల జాబితాలో భారత క్రికెట్ జట్టు మాత్రం తన ర్యాంకుని మెరుగుపరుచుకుంది. తాత్కాలిక కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ సారథిగా విజయాలు సాధించడమే కాదు.. బ్యాటుతోనూ చెలరేగిపోయాడు. దీంతో ఇంగ్లండ్‌, ‌న్యూజిల్యాండ్‌, వెస్టిండీస్ జట్లను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలబడింది. పాక్ మొదటి స్థానంలో ఉంది. 
 
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు ముందు టీమిండియా ఖాతాలో 119 పాయింట్లు ఉండగా.. సిరీస్‌ తర్వాత 121 పాయింట్లకు పెరిగిందని, దీంతో టీమిండియా రెండో ర్యాంకును సొంతం చేసుకుందని ఐసీసీ తెలిపింది. ఇక 124 పాయింట్లతో పాకిస్థాన్ మొదటిస్థానంలో కొనసాగుతుంది.
 
పెళ్లి కారణంగా లంక సిరీస్‌కు దూరమవ్వడంతో ఈ ఎఫెక్ట్ కోహ్లీ టీ-20 ర్యాంకింగ్స్‌పై పడింది. దీంతో కోహ్లి ర్యాంకు మొదటి స్థానం నుంచి మూడోస్థానానికి పడిపోయింది. టీ-20 సిరీస్‌కు దూరమైన కారణంగా కోహ్లీ పాయింట్లు 824 నుంచి 776కు పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments