Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో అంత రేటా : రూ.లక్షల్లో పలుకుతున్న ఇండో-పాక్ టీ20 వరల్డ్ కప్ టిక్కెట్ ధర!!

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (08:53 IST)
మరికొన్ని రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మరోమారు క్రికెట్ మైదానంలో ప్రత్యక్షంగా తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇండో పాక్ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. 
 
ఈ రెండు జట్ల మధ్య జూన్ 9వ తేదీన న్యూయార్క్‌లోని నన్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. అందులో డైమండ్ క్లాస్ సీట్లకు టికెట్ ధరను 20 వేల డాలర్లుగా నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. అంటే సుమారు రూ.16.6 లక్షలు అన్నమాట. దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తీవ్రంగా మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని తప్పుపడుతూ ఓ ట్వీట్ చేశారు. 
 
'భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ కేటగిరీ ఒక్కో సీటుకు 20 వేల డాలర్ల రేటు పెట్టడం చూసి షాక్ అయ్యాను. అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నదే.. ఆటను మరింత విస్తరించడం, అభిమానులను అలరించడం కోసం. అంతే తప్ప అడ్డగోలు టికెట్ చార్జీలు పెట్టి లాభాలు ఆర్జించడం కోసం కాదు. మామూలు టికెట్ కోసం కూడా 2,750 డాలర్లు (సుమారు రూ.2.29 లక్షలు) ధర పెట్టడం దారుణం. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రూక్స్ (మోసగాళ్ల కౌన్సిల్)' అని లలిత్ మోడీ విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి...

24వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

పవన్ మాట - రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట : మాట నిలబెట్టుకున్న జనసేనాని.. తొలి సంతకం అదే..

టమోటా ధరలకు రెక్కలు.. తెలంగాణలో కిలో వంద రూపాయలు

అమేజాన్ ఆర్డర్ బాక్సులో విషపూరిత పాము.. టెక్కీ దంపతులు షాక్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర తుఫాను 100 రోజుల్లో రాబోతోంది

కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్: ముంబైకి వచ్చిన ప్రభాస్

కన్నడ నటుడు దర్శన్ మేనేజర్ ఆత్మహత్య!!

లక్కీ భాస్కర్ నుంచి వినసొంపైన మెలోడీతో .. కోపాలు చాలండి శ్రీమతి గారు గీతం విడుదల

శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి - శ్రీరెడ్డి పోస్ట్ వైరల్

తర్వాతి కథనం
Show comments