Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా ట్వంటీ20 : కాస్త కష్టంగా లక్ష్యఛేదన.. భారత్ బోణీ

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (09:44 IST)
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 110 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా కాస్త కష్టంగా ఛేదించింది. దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్‌), క్రునాల్‌ పాండ్యా (9 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్‌), మనీష్‌ పాండే (24 బంతుల్లో 2 ఫోర్లతో 19) కీలకంగా నిలిచారు. 
 
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. కుల్దీప్‌ మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి నెగ్గింది. 
 
దీంతో మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా కుల్దీప్‌ యాదవ్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన క్రునాల్‌ పాండ్యా, ఖలీల్‌ అహ్మద్‌ అద్భుతంగా ఆకట్టుకున్నారు. రెండో టీ20 లోక్నోలో ఈనెల 6వ తేదీన జరుగనుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments