Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్ : 45 పరుగులకే కుప్పకూలిన భారత్

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (15:39 IST)
బెంగులూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్‌ను కివీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. కివీస్ బౌలర్ల విజృంభణతో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో భోజన విరామ సమయానికి 34 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత కూడా ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 
 
భారత ఆటగాళ్లలో కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. మధ్యలో యశస్వి జైస్వాల్ మాత్రం 13 పరుగులు, రిషబ్ పంత్ 20 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 
 
పంత్ ఔట్ కావడంతో రోహిత్ సేన 39 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 31.2 ఓవర్లలో 46 రన్స్‌కే చేతులెత్తేసింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా, విలియన్ ఓ రూర్కే నాలుగు వికెట్లుతో భారత ఇన్నింగ్స్ పతనంలో తమ వంతు పాత్ర పోషించారు. కాగా, టెస్టుల్లో భారత్ చేసిన మూడో అతి తక్కువ పరుగులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments