Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్ : 45 పరుగులకే కుప్పకూలిన భారత్

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (15:39 IST)
బెంగులూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్‌ను కివీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. కివీస్ బౌలర్ల విజృంభణతో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో భోజన విరామ సమయానికి 34 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత కూడా ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 
 
భారత ఆటగాళ్లలో కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. మధ్యలో యశస్వి జైస్వాల్ మాత్రం 13 పరుగులు, రిషబ్ పంత్ 20 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 
 
పంత్ ఔట్ కావడంతో రోహిత్ సేన 39 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 31.2 ఓవర్లలో 46 రన్స్‌కే చేతులెత్తేసింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా, విలియన్ ఓ రూర్కే నాలుగు వికెట్లుతో భారత ఇన్నింగ్స్ పతనంలో తమ వంతు పాత్ర పోషించారు. కాగా, టెస్టుల్లో భారత్ చేసిన మూడో అతి తక్కువ పరుగులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంపై ఈగ వాలనీయని పవన్.. విద్యార్థుల కష్టాలు తెలిసి కంప్యూటర్లు (video)

జగన్ ఆదేశిస్తే గంటలోనే బాబును, లోకేష్‌లను లేపేస్తా.. బోరుగడ్డ భార్య ఏమంటోంది?

శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుటుంబం బలి

అమ్మాయితో టీడీపీ నేత రాసలీలలు - Video Viral

సీఎం చంద్రబాబుకు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత తొలగింపు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ప్రమోషన్స్ మిగతా హీరోల కంటే విభిన్నంగా కనిపిస్తుంటాయి.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరోయిన్ సమంత (Video)

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ... కొత్త చిత్రాలపై అప్‌డేట్స్ వస్తాయా?

మోక్షజ్ఞ కోసం శోభన.. అమ్మగా కనిపించనున్నారట!

బాహుబలి-3పై నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

తర్వాతి కథనం
Show comments