Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్ : 45 పరుగులకే కుప్పకూలిన భారత్

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (15:39 IST)
బెంగులూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్‌ను కివీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. కివీస్ బౌలర్ల విజృంభణతో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో భోజన విరామ సమయానికి 34 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత కూడా ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 
 
భారత ఆటగాళ్లలో కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. మధ్యలో యశస్వి జైస్వాల్ మాత్రం 13 పరుగులు, రిషబ్ పంత్ 20 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 
 
పంత్ ఔట్ కావడంతో రోహిత్ సేన 39 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 31.2 ఓవర్లలో 46 రన్స్‌కే చేతులెత్తేసింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా, విలియన్ ఓ రూర్కే నాలుగు వికెట్లుతో భారత ఇన్నింగ్స్ పతనంలో తమ వంతు పాత్ర పోషించారు. కాగా, టెస్టుల్లో భారత్ చేసిన మూడో అతి తక్కువ పరుగులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

తర్వాతి కథనం
Show comments