Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో అంతిమ పోరు కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాం : పాట్ కమ్మిన్స్

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (10:57 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోన నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబరు 19వ తేదీ ఆదివారం డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరుగనుంది. గురువారం కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా జట్ల మధ్య అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సఫారీలను కంగారులు ఓడించారు. దీంతో ఫైనల్‌లో భారత్‌తో అమీతుమీకి ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ ఫైనల్ పోరుపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్లో భారత్‌తో తలపడేందుకు వేచి ఉండలేకపోతున్నామన్నాడు. 
 
ఆతిథ్య టీమిండియాకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో అహ్మదాబాద్ స్టేడియం నిండిపోతుందని, భారత్‌కు ఏకపక్ష మద్దతు ఉంటుందని తెలుసని, ఈ పరిస్థితిని స్వీకరించి మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని కమ్మిన్స్ వ్యాఖ్యానించాడు. తమ జట్టు ఆటగాళ్లలోని పలువురికి ఇప్పటికే ఫైనల్స్ ఆడిన అనుభవం ఉండడం తమకు కలిసివచ్చే అవకాశమన్నారు. 2015 వరల్డ్ కప్ తన కెరీర్ బెస్ట్ అని, ఈ కారణంగానే భారత్‌తో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం తాను వేచివుండలేనని కమ్మిన్స్ పేర్కొన్నాడు. 
 
ఇదిలావుండగా అహ్మదాబాద్ స్టేడియం 1.3 లక్షల మంది సామర్థ్యాన్ని కలిగివున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాపై గెలుపుపై స్పందిస్తూ.. సునాయాసంగా గెలుస్తామని భావించామని, కానీ కాస్త ఇబ్బంది పడి గెలవాల్సి వచ్చిందని పాట్ కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు. రెండు గంటలపాటు నరాలు తెగే ఉత్కంఠను అనుభవించాల్సి వచ్చిందని తెలిపాడు. ఆసీస్ ఆటగాళ్లతోపాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా చాలాబాగా ఆడారని అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడి మరణం- పోలవరం వెనుక అనేక కారణాలు.. వైఎస్ షర్మిల

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

తర్వాతి కథనం
Show comments