Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వరల్డ్ కప్ 2019 : భారత్ షెడ్యూల్ ఇదే... హైఓల్టేజ్ మ్యాచ్ ఎపుడంటే..

Webdunia
మంగళవారం, 21 మే 2019 (13:57 IST)
ఈ నెల 30వ తేదీ నుంచి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన ఆడనుంది. సౌతాంఫ్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థి సౌతాఫ్రికాతో తలపడనుంది. 
 
ఆ తర్వాత జూన్ 9వ తేదీన లండన్‌లోని ది ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతోనూ, జూన్ 13వ తేదీన నాటింగ్‌హామ్ వేదికగా ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో న్యూజిలాండ్ జట్టుతో, జూన్ 16వ తేదీన మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో పాకిస్థాన్ జట్టుతో తలపడుతుంది. 
 
అలాగే, జూన్ 22వ తేదీన సౌతాంఫ్టన్‌లో ఆప్ఘనిస్థాన్‌తోనూ, జూన్ 27వ తేదీన మాంచెష్టర్‌లో వెస్టిండీస్‌తో, జూన్ 30వ తేదీన బర్మింగ్‌హ్యామ్ వేదికగా ఇంగ్లండ్‌ జట్టుతో, జూలై 2వ తేదీన బర్మింగ్‌హ్యామ్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో, జూలై 6వ తేదీన లీడ్స్‌లో శ్రీలంక జట్టుతో ఆడనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభంకానున్నాయి. 
 
కాగా, రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన సౌతాఫ్రికాతో ప్రారంభించి, తన చివరి మ్యాచ్‌ను జూలై 6వ తేదీన శ్రీలంకతో ముగిస్తుంది. హైఓల్టేజ్ మ్యాచ్‌గా పరిగణించే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 16వ తేదీన జరుగుతుంది.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments