Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ సేన ప్రపంచ కప్ గెలుస్తుందా? లేదా? కపిల్ దేవ్ ఏమన్నారు?

Webdunia
బుధవారం, 8 మే 2019 (17:46 IST)
ఈ నెలాఖరు నుంచి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇందుకోసం అన్ని క్రికెట్ జట్లూ సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ దఫా ఏ దేశం వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంటుందన్న అంశంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఓ క్లారిటీ ఇచ్చాడు.
 
ఈసారి వరల్డ్ కప్‌ను గెలుచుకునే సత్తా టీమిండియాకు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత జట్టులో యువరక్తంతో పాటు అనుభవం సమపాళ్లలో ఉన్నాయని ప్రశంసించిన ఆయన.. అయితే జట్టు కూర్పుతో పాటు అవసరమైన సమయంలో ఆటగాళ్లు రాణించడం చాలా ముఖ్యమని గుర్తుచేశారు.
 
ఈ మెగా ఈవెంట్‌లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్స్‌లో చోటుసాధించే అవకాశం ఉందని అంచనా వేశారు. సెమీస్‌లో నాలుగో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడే అవకాశం ఉందన్నారు. 
 
ఇక ఈ టోర్నీ న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు హార్దిక్ పాండ్యా జట్టులో ఉండడం భారత క్రికెట్ జట్టుకు కలిసివచ్చే అంశమన్నారు. పాండ్యాను అతని సహజశైలిలో ఆడనివ్వాలని అభిప్రాయపడ్డారు. కాగా, 1983లో కపిల్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించి టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments