Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 ప్రపంచకప్: వికెట్ పడకుండా పపువాపై భారత్ ఘనవిజయం

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. పపువా న్యూగినియాపై భారత్ పది వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా అండర్ -19 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా రెండోసారి విజయం సాధించినట్లైంది.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (14:51 IST)
అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. పపువా న్యూగినియాపై భారత్ పది వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా అండర్ -19 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా రెండోసారి విజయం సాధించినట్లైంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా జట్టు, భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఫలితంగా పపువా న్యూగినియా 21.5 ఓవర్లలో 64 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ స్వల్ప పరుగుల లక్ష్యాన్ని 8 ఓవర్లలో వికెట్ పడకుండా భారత జట్టు అవలీలగా చేధించింది. 
 
భారత బ్యాట్స్‌మెన్లలో అర్థశతకంతో పృథ్వీషా తన సత్తా చాటాడు. 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో అనుకూల్ రాయ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. శివమ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, నాకర్‌కోటి, అర్షదీప్‌లు తలో వికెట్ సాధించారు. ఇక ఈ నెల 19న భారత జట్టు జింబాబ్వే జట్టుతో ఢీకొననుంది.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments