Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త.. ఒలింపిక్స్‌లో క్రికెట్?

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (15:31 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్రికెట్‌ అభిమానులకు పండగా లాంటి వార్త చెప్పింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ)తో ఐసీసీ చర్చలు జరిపింది. 
 
అయితే, అప్పుడు బీసీసీఐ అందుకు అంగీకారం తెలపలేదు. కానీ ప్రస్తుతం బీసీసీఐ సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఉంటుందని చెబుతున్నారు. 
 
ఇక ఎనిమిది టీమ్‌ల మధ్య పోరు ఉండనున్నట్లు భావిస్తున్నారు. అలాగే ఫార్మట్‌ విషయానికొస్తే టీ 20 లేదా టీ 10లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో 1900లో పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేశారు. కానీ అనంతరం దానిని కొనసాగించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో గొడవలు.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. పిల్లల్ని కూడా..?

అల్పపీడన ద్రోణి.. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

రూ.18లక్షలు స్వాహా.. హైదరాబాద్‌లో టెక్కీని నిమిషాల్లో కాపాడారు..

ఇంట్లో దొంగలు పడ్డారు.. నగలు, నగదు గోవిందా.. ఫ్రిజ్‌లో పెట్టిన బిర్యానీ కూడా..?

మంగళగిరి ఎయిమ్స్‌లో నీటి కొరతా.. చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

తర్వాతి కథనం
Show comments