Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా ఇంటికి... సెమీస్‌కు ఇంగ్లండ్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (22:04 IST)
సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్-12 గ్రూపు ఏలో శనివారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందింది. దీంతో ఇంగ్లండ్ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టగా, పాయింట్ల పరంగా మూడో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
 
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో గ్రూపు-1 నుంచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ గ్రూపులో తొలి స్థానంలో న్యూజిలాండ్ ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్ నిలిచింది. లంకపై ఇంగ్లండ్ జట్టు విజయంతో ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయి. ఒకవేళ్ల ఇంగ్లండ్‌పై లంక జట్టు గెలిచివుంటే, మ్యాచ్ పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లివుండేది. కానీ, ఇంగ్లండ్ గెలుపుతో గ్రూపు-1 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు టాప్‌-4లో నిలిచాయి. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేయగా, ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు 142 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి ఆరు వికెట్లను కోల్పోయి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

తర్వాతి కథనం
Show comments