Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు 'ప్రాణం' పోద్దాం : షోయబ్ అక్తర్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (15:40 IST)
భారత కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తారాస్థాయికి చేరుకుంది. పలు రాష్ట్రాల్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. దేశంలోని ఆస్పత్రులన్నీ ఫుల్ అయిపోయాయి. ఆక్సిజన్ నిల్వలు కరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాణవాయువు లభించక అనేక మందిరోజులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 
 
ఇలా కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌ను ఆదుకునేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ స‌మ‌యంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఇచ్చిన ఓ వీడియో సందేశం ఇండో-పాక్ అభిమానుల‌ను ఫిదా చేసింది. 
 
వైర‌స్‌పై పోరాటంలో భాగంగా ఇండియాకు స‌హాయం చేద్దామంటూ అతడు ఆ వీడియోలో పిలుపునిచ్చాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డం ఏ ప్ర‌భుత్వానికైనా అసాధ్య‌మ‌ని అక్త‌ర్ అన్నాడు. ఆక్సిజ‌న్ కొర‌తతో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌తదేశానికి ఆక్సిజ‌న్ ఇవ్వండంటూ పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 
 
'మా ప్ర‌భుత్వం, అభిమానుల‌ను ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజ‌న్ ట్యాంకులు కావాలి. ప్ర‌తి ఒక్క‌రూ ఇండియా కోసం విరాళాలు సేక‌రించి, వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ ట్యాంకుల‌ను అందించాల‌ని కోరుతున్నాను' అని త‌న యూట్యూబ్ చానెల్ వీడియోలో అక్త‌ర్ కోరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments