Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెటీగల దాడితో ఆగిన క్రికెట్ మ్యాచ్... పరుగులు పెట్టిన రాహుల్ ద్రవిడ్...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (17:41 IST)
క్రికెట్ మ్యాచ్ మధ్యలో అనేకసార్లు అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని వినోదాన్ని పంచుతాయి, మరికొన్ని కాస్తంత కోపాన్ని తెప్పిస్తాయి. అయితే తేనెటీగల దాడి జరగడం అంటే ఓ వైపు తమాషాగా ఉన్నా మరోవైపు ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. అలాంటి ఘటనే ఈ రోజు చోటుచేసుకుంది. 
 
భారత్ ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ మైదానంలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆకస్మాత్తుగా తేనెటీగలు ప్రేక్షకులపై దాడి చేసాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా మైదానం బయటకు పరుగులు తీసారు. తేనెటీగల నుండి తమను తాము రక్షించుకోవడానికి చొక్కాలు విప్పి గాలిలో ఊపుతూ మరీ పరిగెత్తారు. 
 
మ్యాచ్‌లో 28వ ఓవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, మైదానంలోకి అవి రాలేదని అధికారులు తెలిపారు. అయితే గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రం దాడి చేసాయన్నారు. దాడి సమయంలో భారత్- ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అక్కడే ఉన్నాడని, అయితే వాటి నుండి తప్పించుకోవడానికి పరుగు తీసాడని చెప్పారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలించినట్లు స్పష్టం చేసారు.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments