Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం : బీసీసీఐ చీఫ్ గంగూలీ

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (15:37 IST)
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అది అతని వ్యక్తిగతమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. "ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలోని అన్ని ఫార్మెట్లలో భారత్ క్రికెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. భవిష్యత్‌లోనూ ఈ జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలోనూ విరాట్ కోహ్లీ కీలక సభ్యుడుగా ఉంటాడు. విరాట్ అద్భుత ఆటగాడు. వెల్డన్" అంటూ గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇటీవల వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇపుడు బీసీసీఐకు - కోహ్లీకి మధ్య బహిరంగ వార్ జరిగింది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవద్దని తాము కోరామని గంగూలీ చెప్పగా, దాన్ని కోహ్లీ ఖండించారు. అలాగే, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే సమయంలో కూడా గంట ముందు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని కోహ్లీ ఆరోపించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments