Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ టైటాన్స్‌ దూకుడుకు పంజాబ్ బ్రేక్

Webdunia
బుధవారం, 4 మే 2022 (08:51 IST)
ఐపీఎల్ 15 సీజన్ పోటీల్లో వరుస విజయాలతో దూసుకునిపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్రేక్ పడింది. గుజరాత్ దూకుడుకు పంజాబ్ బ్రేక్ వేసింది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే సాధించింది. దీంతో గుజరాత్ జట్టు ఓటమిని చవిచూసింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు ఏమాత్రం కలిసిరాలేదు. పంజాబ్ బౌలర్ కగిసో రబడ గుజరాత్ అటగాళ్ళు పరుగులు చేయలేక పోయారు. రబడ నిప్పులు చెరుగుతూ బంతులు విసిరాడు. దీంతో ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూకట్టారు. కానీ, సాయి సుదర్శన్ మాత్రం ఆ జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచి 50 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 65 పరుగుులు చేయడమే కాకుండా అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ (1) వికెట్లను త్వరగా కోల్పోయినప్పటికీ శిఖర్ ధావన్ - భానుక రాజపక్స జోడీ 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో రాజపక్స 40 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్ స్టోన్ అండగా నిలబడటంతో శిఖర్ ధావన్ మిగిలిన పనిని పూర్తి చేశాడు. శిఖర్ ధావన్ మొత్తం 53 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 62 పరుగులు చేయగా, స్టోన్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఫలితంగా 16 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పంజాబ్ జట్టు విజయభేరీ మోగించింది. నాలుగు వికెట్లు తీసిన రబడకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments