Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడా రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో... ఎవరతను?

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2023 (15:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ వారసుడిగా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తన ప్రతిభతో గ్లోబల్ స్టార్‌గా పేరు గడించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త అవతారమెత్తారు. ఆయన ఇపుడు క్రీడా రంగంలోకి అడుగుపెట్టారు. గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కొత్త వెంచర్‌ను ప్రారంభించారు. ఇందుకోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ టీమ్‌ను స్థాపించి, యజమానిగా మారారు. ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ టీమ్‌కు యజమానిగా మారినందుకు సంతోషంగా ఉంది. ప్రతిభ, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా' అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అలాగే, హైదరాబాద్ జట్టులో భాగం కావాలని భావించే ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోవాలంటూ రామ్ చరణ్ ఓ లింక్‌‌ను కూడా షేర్ చేశారు. 
 
కాగా, ముంబై జట్టుకు అమితాబ్ బచ్చన్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్, జమ్మూకాశ్మీర్ టీంకు అక్షయ్ కుమార్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఐఎస్‌పీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. వర్ధమాన క్రికెట్ ఆటగాళ్లకు గుర్తింపు కల్పించేందుకు, కొత్త టాలెంట్‌ను వెలికి తీసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని భారత మాజీ సెలెక్టర్, ఐఎస్ పీఎల్ సెలక్షన్ కమిటీ హెడ్ జతిన్ పరాంజపే అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments