Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్‌కు అజారుద్దీన్ ఆహ్వానం.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (09:08 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ కొనసాగుతున్నారు. ఆమెను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కలుసుకుని ఒక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు. 
 
మంగళవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. రెండో మ్యాచ్ 23వ తేదీన, మూడో మ్యాచ్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు గవర్నర్‌ను అజారుద్దీన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు అజారుద్దీన్ స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలిసి మ్యాచ్‌కు రావాలంటూ ఆహ్వానించారు. 
 
ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా, 3 టీ20 మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ మూడో మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం సభ్యులతో కలిసి తనను కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అహ్వానించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments