Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్‌కు అజారుద్దీన్ ఆహ్వానం.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (09:08 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ కొనసాగుతున్నారు. ఆమెను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కలుసుకుని ఒక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు. 
 
మంగళవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. రెండో మ్యాచ్ 23వ తేదీన, మూడో మ్యాచ్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు గవర్నర్‌ను అజారుద్దీన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు అజారుద్దీన్ స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలిసి మ్యాచ్‌కు రావాలంటూ ఆహ్వానించారు. 
 
ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా, 3 టీ20 మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ మూడో మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం సభ్యులతో కలిసి తనను కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అహ్వానించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments