Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్‌కు అజారుద్దీన్ ఆహ్వానం.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (09:08 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ కొనసాగుతున్నారు. ఆమెను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కలుసుకుని ఒక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆహ్వానించారు. 
 
మంగళవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. రెండో మ్యాచ్ 23వ తేదీన, మూడో మ్యాచ్ 25వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు గవర్నర్‌ను అజారుద్దీన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు అజారుద్దీన్ స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలిసి మ్యాచ్‌కు రావాలంటూ ఆహ్వానించారు. 
 
ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా, 3 టీ20 మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ మూడో మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం సభ్యులతో కలిసి తనను కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అహ్వానించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments