Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని - ఇల్లాలిని వదిలేసి.. 24x7 ప్రజా సేవలో రియల్ హీరో!

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (20:37 IST)
అతనికి ఇల్లు, భార్యాపిల్ల కంటే ప్రజలే సంరక్షణే ముఖ్యం. అందుకే ఇంటిని, ఇల్లాలిని వదిలిపెట్టి... ప్రజల కోసం 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ రియల్ హీరో అని ప్రజలతో జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ రియల్ ఎవరో కాదు.. మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ. భారత ట్వంటీ20 ప్రపంచ కప్ హీరో. 
 
క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న త‌రుణంలో.. ధైర్యంగా విధులు నిర్వ‌ర్తిస్తున్న జోగింద‌ర్ శ‌ర్మపై ఇప్ప‌టికే ఐసీసీ ప్ర‌శంస‌లు కురిపించిన విష‌యం తెలిసిందే. తాను వారంలో 24 గంటల పాటు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని.. ప్ర‌జా సేవే త‌న ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం అని జోగింద‌ర్ తాజాగా వెల్ల‌డించాడు.
 
ఇదే అంశంపై జోగిందర్ శర్మ ఓ ట్వీట్ చేశారు. "24 గంట‌లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటా. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు విధులు నిర్వ‌ర్తించి ఇంటికి చేరిన త‌ర్వాత కూడా.. ఏదైన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి నెల‌కొంటే వెంట‌నే అక్క‌డ వాలిపోతా. ప్ర‌స్తుతం నేను విధులు నిర్వ‌ర్తిస్తున్న హిస్సార్ ప్రాంతంలో ప్ర‌జ‌ల‌కు వైర‌స్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని సూచిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. 
 
కాగా, 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆఖ‌రి ఓవ‌ర్ వేసి, భారత క్రికెట్ జట్టును విజేతగా నిలిపాడు. దీంతో రాత్రికి రాత్రే జాతీయ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికిన తర్వాత అనంత‌రం హ‌ర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్ - దిగి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

తర్వాతి కథనం
Show comments