Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ టెస్ట్ సిరీస్‌కు హనుమ విహారిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (09:32 IST)
త్వరలో స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో భారత క్రికెట్ జట్టు క్రికెట్ సిరీస్‌ను ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే టీమిండియా జట్టును కూడా ఎంపిక చేశారు. ఇందులో యువ బ్యాట్స్‌మెన్ హనుమ విహారికి చోటుదక్కలేదు. దీనిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. 
 
త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారిని (Gavaskar on Vihari) ఎంపిక చేయకపోవడం తాననేమి ఆశ్చర్యానికి గురిచేయలేదన్నారు. విహారి గత కొన్ని నెలలుగా క్రికెట్‌ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. 
 
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో విహారి ఆడకపోవడం వల్ల అతడు సెలెక్టర్ల దృష్టిలో పడలేదన్నారు. ఇటీవలి కాలంలో ఐపీఎల్‌లోని ప్రదర్శనలు జాతీయ జట్టులో ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. నవంబర్‌ 25 నుంచి కివీస్‌తో జరిగే రెండు టెస్టులకు ఇటీవలే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. విహారిని ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లపై అనేక విమర్శలు వచ్చాయి.
 
'నిజాయితీగా చెప్పాలంటే హనుమ విహారిని ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. అతడు గత మూడు, నాలుగు నెలల్లో ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు కొంతకాలంగా క్రికెట్‌ ఆడుతున్నారు. వాళ్లు ఎంపిక కావడానికి ఇదే కారణం కావొచ్చు.' అని గావస్కర్​ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments