Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అధమస్థాయికి దిగజారింది... ఇర్ఫాన్ పఠాన్

వరుణ్
గురువారం, 28 మార్చి 2024 (09:37 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌ ప్రారంభ పోటీ నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్‌లో భాగంగా, బుధవారం రాత్రి జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో ముంబై జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో ముంబై జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఏకంగా 277 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ముంబై జట్టు విజయానికి మరో 32 పరుగులు దూరంలో వచ్చి ఆగిపోయింది. అయితే, ఈ సీజన్‌లో ముంబై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి, హార్దిక్ పాండ్యాకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు చేతిలో దారుణ ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యాను లక్ష్యంగా చేసుకుని మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
స్టార్ బౌలర్ జస్రీత్ బుమ్రా అందుబాటులో ఉన్నప్పటికీ ఆలస్యంగా బౌలింగ్ చేయించడంపై మండిపడ్డాడు. 'సాధారణంగా ఉండే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అధమస్థాయికి దిగజారింది. ప్రత్యర్థి జట్టు అంతలా విధ్వంసం సృష్టిస్తుంటే బుమ్రాను సకాలంలో బౌలింగ్ వేయించకుండా దూరంగా ఉంచడం ఏంటో నాకైతే అర్థం కాలేదు' అని ఎక్స్ వేదికగా పఠాన్ విమర్శించాడు. ఇక ఐపీఎల్లో రికార్డు స్కోరు సాధిస్తుందని భావించిన ముంబై ఇండియన్స్ జట్టుపైనే రికార్డు స్కోరు నమోదవుతుందని ఎవరు ఊహిస్తారని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. 
 
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చితక్కొట్టిందని మెచ్చుకున్నాడు. హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ తీరుపై కూడా ఇర్ఫాన్ పఠాన్ విరుచుకుపడ్డాడు. టీమ్ మొత్తం 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుంటే కెప్టెన్ కనీసం 120 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయలేదా అని తీవ్ర విమర్శలు గుప్పించాడు. కాగా భారీ లక్ష్య ఛేదనలో హార్థిక్ పాండ్యా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొత్తంగా ఛేజింగులో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 246/5 స్కోరు మాత్రమే చేయగలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments