Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌పై గెలుపు అంత సులువేమి కాదు : హర్భజన్ సింగ్

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (09:58 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. దీనికి కారణం ఇప్పటికే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి, ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడాలన్నది కోట్లాది మంది క్రికెట్ అభిమానుల బలమైన ఆకాంక్షగా ఉంది. 
 
ఈ పరిస్థితుల్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న అంశంపై పలువురు మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు. ఇంగ్లండ్‌పై విజయం అంత సులువేమీ కాదన్నారు. అయితే, ప్రతి భారతీయుడితో పాటు తాను కూడా రేపటి సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి భారత్ ఫైనల్‍‌కు చేరాలని కోరుంటున్నానని తెలిపాడు. 
 
"గురువారం మన మ్యాచ్ ఉంది. ఇంగ్లండ్‌‍తో సెమీస్ మ్యాచ్ కఠినంగానే ఉంటుంది. అయితే, ఏం జరుగుతుందో చూడాలి. దేశమంతా భారత్ గెలవాలని కోరుకుంటుంది" అని భజ్జీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments