Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటువైపు ఎవరున్నా తగ్గేదేలే.. గౌతం గంభీర్

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (13:31 IST)
టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్-గౌతమ్ గంభీర్ ఇటీవల వార్తల్లో నిలిచారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా ఇటీవల సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 
 
ఈ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మైదానంలో ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు. గంభీర్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహచరులను ఎలా గౌరవించాలో గంభీర్‌కు తెలియదని ఆరోపించారు.
 
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘర్షణే చోటుచేసుకుంది. కోహ్లితో నవీనుల్ హక్, గంభీర్ వాగ్వాదానికి దిగారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. 
 
తాజాగా ఈ ఘటనపై గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మ్యాచ్ మధ్యలో జోక్యం చేసుకునే హక్కు తనకు లేదని, అయితే మ్యాచ్ ముగిసే సమయానికి వెళ్లి తన ఆటగాళ్లతో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అటువైపు ఎవరున్నా తగ్గేదేలే.. తమ ఆటగాళ్లను కాపాడుకోవడం తమ బాధ్యత అని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

నిమ్స్ ఆస్పత్రి అనెస్తీషియా వైద్యుడి ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లావణ్యతో సహజీవనం చేసిన మాట వాస్తమే.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వలేదు : హీరో రాజ్ తరుణ్

కల్కి చిత్రంపై విమర్శలకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ స్టేట్ మెంట్ !

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

తర్వాతి కథనం
Show comments