Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటువైపు ఎవరున్నా తగ్గేదేలే.. గౌతం గంభీర్

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (13:31 IST)
టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్-గౌతమ్ గంభీర్ ఇటీవల వార్తల్లో నిలిచారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా ఇటీవల సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 
 
ఈ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మైదానంలో ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు. గంభీర్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహచరులను ఎలా గౌరవించాలో గంభీర్‌కు తెలియదని ఆరోపించారు.
 
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘర్షణే చోటుచేసుకుంది. కోహ్లితో నవీనుల్ హక్, గంభీర్ వాగ్వాదానికి దిగారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. 
 
తాజాగా ఈ ఘటనపై గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మ్యాచ్ మధ్యలో జోక్యం చేసుకునే హక్కు తనకు లేదని, అయితే మ్యాచ్ ముగిసే సమయానికి వెళ్లి తన ఆటగాళ్లతో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అటువైపు ఎవరున్నా తగ్గేదేలే.. తమ ఆటగాళ్లను కాపాడుకోవడం తమ బాధ్యత అని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments