Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మానవుడ్ని - మానవాళి వేదన చెందుతుంటే... గంభీర్ నోట భగత్ సింగ్ వ్యాఖ్యలు

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (07:48 IST)
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ నోట భగత్ సింగ్ వ్యాఖ్యాలను ఉటంకించారు. నేను మానవుడ్ని - మానవాళి వేదన చెందుతుంటే చూడలేక ఆ పని చేశాను అంటూ వ్యాఖ్యానించారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న వేళ... గౌతమ్ గంభీర్ పలు రకాల సేవలు అందించారు. ఈ క్రమంలో ఆయన కరోనా చికిత్సలో ఉపయోగించే ఫాబిఫ్లూ మాత్రలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. 
 
ఈ అంశాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఔషధాల కొరత ఉన్న సమయంలో గంభీర్ అంతపెద్దమొత్తంలో ఫాబిఫ్లూ ఎలా కొనుగోలు చేయగలిగాడని ప్రశ్నించింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్‌తో విచారణకు ఆదేశించింది. 
 
దీంతో విచారణ చేపట్టిన ఢిల్లీ ఔషధ నియంత్రణ సంస్థ గంభీర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫాబి ఫ్లూ ఔషధాన్ని అనుమతుల్లేకుండానే కొనుగోలు చేసిందని న్యాయస్థానానికి తెలియజేసింది. అంటే తప్పు చేసినట్టు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో, గంభీర్ ట్విట్టర్‌లో స్పందించారు. "నేను మానవుడ్ని.... మానవాళి వేదన చెందుతుంటే నేను తట్టుకోలేను" అంటూ నాడు భగత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. తద్వారా ప్రజల క్షేమం కోసమే తాను ఫాబిఫ్లూ కొనుగోలు చేశానన్న తన మనోభావాలను ఈ విధంగా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments