Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ధోనీ... ఫిబ్రవరి 12 నుంచి ఐపీఎల్ మెగా వేలం పాట

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (09:16 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకు చేరుకున్నారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం పాటలు జరుగనున్నాయి. ఈ పాటల్లో పాల్గొనేందుకు ఆయన చెన్నైకు వచ్చారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ వేలం పాటలు జరుగనున్నాయి. అప్పటివరకు ఆయన చెన్నైలో ఉండి ఆటగాళ్ల ఎంపిక తదితర అంశాలపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిర్వాహకులతో సమాలోచనలు జరుపనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో ధోని ఫోటోను షేర్ చేసి తెలిపింది. 
 
"అవును, అతను ఈ రోజు చెన్నైకి వచ్చాడు. వేలం పాట చర్చల కోసం అతను ఇక్కడే ఉంటాడు. అతను వేలానికి హాజరయ్యే అవకాశం ఉంది" అంటూ ట్వీట్ చేసింది. కాగా, ధోనీని ఈ యేడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు (రీటైన్) చేసిన ఆటగాళ్ళలో రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీతో సహా నలుగురు ఆటగాళ్లను రిటైన్ ఉన్నారు. 
 
ఇందులో జడేజాను రూ.16 కోట్లకు అట్టిపెట్టుకోగా, ధోనీ రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, అలీని రూ.8 కోట్లకు రిటైన్ చేయగా, గైక్వాడ్ రూ.6 కోట్లకు దక్కించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments