Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ధోనీ... ఫిబ్రవరి 12 నుంచి ఐపీఎల్ మెగా వేలం పాట

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (09:16 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకు చేరుకున్నారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం పాటలు జరుగనున్నాయి. ఈ పాటల్లో పాల్గొనేందుకు ఆయన చెన్నైకు వచ్చారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ వేలం పాటలు జరుగనున్నాయి. అప్పటివరకు ఆయన చెన్నైలో ఉండి ఆటగాళ్ల ఎంపిక తదితర అంశాలపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిర్వాహకులతో సమాలోచనలు జరుపనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో ధోని ఫోటోను షేర్ చేసి తెలిపింది. 
 
"అవును, అతను ఈ రోజు చెన్నైకి వచ్చాడు. వేలం పాట చర్చల కోసం అతను ఇక్కడే ఉంటాడు. అతను వేలానికి హాజరయ్యే అవకాశం ఉంది" అంటూ ట్వీట్ చేసింది. కాగా, ధోనీని ఈ యేడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు (రీటైన్) చేసిన ఆటగాళ్ళలో రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీతో సహా నలుగురు ఆటగాళ్లను రిటైన్ ఉన్నారు. 
 
ఇందులో జడేజాను రూ.16 కోట్లకు అట్టిపెట్టుకోగా, ధోనీ రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, అలీని రూ.8 కోట్లకు రిటైన్ చేయగా, గైక్వాడ్ రూ.6 కోట్లకు దక్కించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments