Webdunia - Bharat's app for daily news and videos

Install App

డారెన్‌ సామికి పాకిస్థాన్ పౌరసత్వం.. ఎలా లభించిందంటే?

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:29 IST)
వెస్టిండీస్‌‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామికి పాకిస్థాన్ పౌరసత్వం లభించనుంది. 2017లో ఇతర దేశాల క్రికెటర్లు పాక్‌ వచ్చేందుకు నిరాకరిస్తున్న సమయంలో డారెన్‌ పీఎస్‌‌ఎల్‌‌లో ఆడాడు. ఆ తర్వాత పాక్‌‌కు వచ్చే విదేశీ క్రికెటర్ల సంఖ్య పెరిగింది. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్‌ గడ్డపై మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ జరగడం వెనుక సామి చేసిన కృషికి గుర్తింపుగా ఆ దేశపు పౌరసత్వం ఇవ్వనుంది. వచ్చేనెల 23న జరిగే కార్యక్రమంలో తమ ప్రెసిడెంట్‌ ఆరిఫ్‌ అల్వీ  గౌరవ పౌరసత్వంతో పాటు పాక్‌ అత్యున్నత పురస్కారం ‘నిషాన్‌ ఈహైదర్‌ ’తో సామిని సత్కరిస్తారని పీసీబీ ప్రకటించింది. 
 
దాంతో వేరే దేశం నుంచి గౌరవ పౌరసత్వం తీసుకుంటున్న మూడో ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌‌గా సామి నిలువనున్నాడు. గతంలో సెయింట్‌ కిట్స్‌ ప్రభుత్వం మాథ్యూ హేడెన్‌ (ఆస్ట్రేలియా), హెర్షల్‌ గిబ్స్‌ (దక్షిణాఫ్రికా)కు పౌరసత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments