కరోనా క్రైసిస్ : ఆ నాలుగు సంస్థలకు రోహిత్ విరాళాలు

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (13:37 IST)
దేశం కరోనా కోరల్లో చిక్కుకుంది. దీని నుంచి బయటపడేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ కష్ట సమయంలో పేదలను, కరోనా బాధితులను ఆదుకునేందుకు వీలుగా అనేక మంది దాతలు తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందులో భారత క్రికెటర్ రోహిత్ శర్మ కూడా చేఱారు. ఈయన మొత్తం రూ.80 లక్షలను విరాళంగా ప్రకటించాడు. 
 
ఈ మొత్తంలో పీఎం కేర్స్ నిధికి రూ.45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు రూ.5 లక్షల చొప్పున అందించినట్టు మంగళవారం రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 
 
దేశం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలని, ఇందుకోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రోహిత్ గుర్తు చేశాడు. కరోనాపై యుద్ధంలో ప్రధాని మోడీతో పాటు నాయకులకు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చాడు. 
 
వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు విరాళమిచ్చి.. వీధి శునకాల సంక్షేమానికి హిట్​మ్యాన్ తోడ్పాటునందించాడు. జంతు ప్రేమికుడిగా మరోసారి నిరూపించుకున్నాడు.
 
కాగా, ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ దంపతులు, ఓపెనర్​ ధవన్​, రహానే, రైనాతో పాటు మరికొందరు క్రికెటర్లు విరాళాలు ఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల విలువైన బియ్యాన్ని అవసరార్థులకు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments