Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి..? శిఖర్ ధావన్‌పై ఫిర్యాదా? ఏం చేశాడంటే?

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (18:42 IST)
టీమిండియా ఓపెనర్, గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్‌పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఓ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో శిఖర్ ధావన్ మీద పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. పక్షులకు ఆహారం పెట్టడం. వాటిని చేతులతో పట్టుకోవడం. ఇటీవల శిఖర్ ధావన్ లక్నోలో పర్యటించాడు. అక్కడ కొన్ని పక్షులకు ఆహారం అందించాడు. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. 
 
అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతుంటే.. వలస పక్షులకు ఆహారం అందించడం ద్వారా, వాటిని పట్టుకుంటే బర్డ్ ఫ్లూ వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని, శిఖర్ ధావన్ అవేవీ పట్టించుకోలేదంటూ వారణాసికి చెందిన ఓ న్యాయవాది కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కేసు విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
 
శిఖర్‌ ధావన్‌ గతవారం వారణాసి పర్యటనకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో  సరదాగా ఓ బోటులో తిరుగుతూ అక్కడి పక్షులకు ఆహారం వేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ధావన్ పేర్కొన్నాడు. 
 
ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో వారణాసి కలెక్టర్‌ స్పందించారు. ధావన్‌ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న తరుణంలో పక్షులకు మేత వేయడం నిషిద్ధం. అయితే బోటులో పక్షులకు ఆహారం వేసేందుకు పర్యాటకులను ఎలా అనుమతిస్తారని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. వీటిపై పర్యాటకులకు అవగాహన ఉండకపోవచ్చు. బోటు యజమానులు విషయం చెప్పకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

తర్వాతి కథనం
Show comments