Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా దాడి ఖండన : ఇమ్రాన్ ఖాన్ ఫోటో తొలగింపు

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:15 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ప్రస్తుతం ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. అయితే, పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ సీసీఐ (క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా) ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను తొలగించింది. బ్రాబోర్న్‌ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్‌ కమిటీ నిర్ణయించింది. అంతేకాదు ఇమ్రాన్‌ఖాన్‌ ఉన్న పాకిస్థాన్ జట్టు ఫొటోను కూడా తొలగించారు. 
 
'ఆల్‌ రౌండర్' విభాగంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోను, క్రికెట్‌ జట్టు విభాగంలో పాకిస్థాన్‌ ఫొటోలను ఇక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్‌ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్‌ కమిటీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 
 
ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఫొటోను క్లబ్‌ గ్యాలరీ నుంచి తొలగించాలంటూ సిసిఐపై ఒత్తడి వస్తూనే ఉంది. ఇమ్రాన్‌ క్రికెట్‌లో సాధించిన రికార్డులు, ఘనతలకు గౌరవమిస్తూ సీసీఐ ఆయన ఫొటోలను తొలగించలేదు. పుల్వామా ఉగ్రదాడిలో 49 మంది భారత జవాన్లు మృతి చెందారు. ఈ దారుణ ఘటనను ఇమ్రాన్‌ ఖాన్ ఖండించలేదు. దీనిపై ఆయన మౌనం వహించడాన్ని సీసీఐ ఖండించింది. దీంతో ఫొటోలను అక్కడి నుంచి తొలగిస్తూ సీసీఐ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

భర్తలేని జీవితం.. ఇక జీవించడం కష్టం.. నదిలో బిడ్డల్ని పారవేసింది.. ఆపై ఆమె కూడా?

నారా చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రాజీవ్‌రెడ్డి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

తర్వాతి కథనం
Show comments