Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా దాడి ఖండన : ఇమ్రాన్ ఖాన్ ఫోటో తొలగింపు

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:15 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ప్రస్తుతం ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. అయితే, పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ సీసీఐ (క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా) ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను తొలగించింది. బ్రాబోర్న్‌ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్‌ కమిటీ నిర్ణయించింది. అంతేకాదు ఇమ్రాన్‌ఖాన్‌ ఉన్న పాకిస్థాన్ జట్టు ఫొటోను కూడా తొలగించారు. 
 
'ఆల్‌ రౌండర్' విభాగంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోను, క్రికెట్‌ జట్టు విభాగంలో పాకిస్థాన్‌ ఫొటోలను ఇక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్‌ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్‌ కమిటీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 
 
ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఫొటోను క్లబ్‌ గ్యాలరీ నుంచి తొలగించాలంటూ సిసిఐపై ఒత్తడి వస్తూనే ఉంది. ఇమ్రాన్‌ క్రికెట్‌లో సాధించిన రికార్డులు, ఘనతలకు గౌరవమిస్తూ సీసీఐ ఆయన ఫొటోలను తొలగించలేదు. పుల్వామా ఉగ్రదాడిలో 49 మంది భారత జవాన్లు మృతి చెందారు. ఈ దారుణ ఘటనను ఇమ్రాన్‌ ఖాన్ ఖండించలేదు. దీనిపై ఆయన మౌనం వహించడాన్ని సీసీఐ ఖండించింది. దీంతో ఫొటోలను అక్కడి నుంచి తొలగిస్తూ సీసీఐ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments