Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:03 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆంగ్ల మీడియా కోడైకూస్తోంది. టీ20 ప్రపంచ కప్ అనంతరం అతను వన్డే, టీ20లలో కెప్టెన్సీ వీడనున్నట్టు సమాచారం.

టీ20 ప్రపంచ కప్ తర్వాత తనంతట తాను టీ20, వన్డేలలో కెప్టెన్సీ నుంచి తప్పుకుని హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే యోచనలో కోహ్లి ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కోహ్లి యోచిస్తున్నాడట. దీనిపై బీసీసీఐతో కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
 
ఇప్పటివరకు కోహ్లి 95 వన్డే మ్యాచ్‌లకు సారథ్యం వహించగా 65 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అలాగే 45 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా 29 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అంటే విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్నట్టే. అయితే సారథ్య బాధ్యతలతో అతను బ్యాటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టట్లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.
 
మరో వైపు రోహిత్ కూడా అవసరమైనప్పుడు తన నాయకత్వాన్ని ప్రదర్శించి సత్తా చాటుకున్నాడు. అలాగే ఐపీఎల్ లో ముంబైకు 5 ట్రోఫీలు అందించి తనేంటో నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ కెప్టెన్సీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments