మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ బెంగుళూరులో జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. స్థానిక చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసీస్ జట్టులో రిచర్డ్సన్ స్థానంలో హేజల్వుడ్ వచ్చి చేరగా, భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు. కాగా ఇరు జట్లు సిరీస్లో ఇప్పటికే 1-1తో సమ ఉజ్జీలుగా నిలవగా ఆఖరిదైన ఇవాళ్టి వన్డే విజేతను నిర్ణయించనుంది. ఇక ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందగా, రెండో వన్డే మ్యాచ్లో భారత్ విజయభేరీ మోగించింది.