Webdunia - Bharat's app for daily news and videos

Install App

వుమెన్స్ టీ-20 ఛాలెంజ్- స్పాన్సర్‌గా జియో.. బీసీసీఐ ప్రకటన

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (18:19 IST)
women cricket team
ఐపీఎల్ తరహాలో వుమెన్స్ టీ-20 ఛాలెంజ్‌కు టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో స్పాన్సర్‌గా ఉండేందుకు అంగీకారం తెలిపింది. బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగనుంది. ప్రస్తుతం యూఏఈలో ఇండియన్ ఫ్రీమియర్ లీగ్ 2020 జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ లీగ్ ముగిసేలోపు వుమెన్స్ టీ20 చాలెంజ్‌ను కూడా నిర్వహిస్తారు. వుమెన్స్ టీ20 చాలెంజ్‌లో ప్రస్తుతానికి ఆస్ట్రేలియా క్రీడాకారిణిలు పాల్గొనడం లేదు. 
 
ఆస్ట్రేలియాలో వుమెన్స్ బిగ్ బ్యాష్ ఉన్నందున వారు ఇందులో పాల్గొనరు. కానీ ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేవ్‌, థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణిలు ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు. దానికి జియో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 
 
ఇక వుమెన్స్ టీ20 చాలెంజ్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ.. దేశంలోని యువతులు కూడా క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో వుమెన్స్ టీ20 చాలెంజ్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నామని తెలిపారు.
 
కాగా షార్జాలో నవంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు వుమెన్స్ టీ20 చాలెంజ్ జరుగుతుంది. అందులో 3 జట్లు పాల్గొంటాయి. వెలాసిటీ, సూపర్ నోవాస్‌, ట్రెయిల్‌బ్లేజర్స్ జట్లు తలపడుతాయి. ఐపీఎల్ ఫైనల్ నవంబర్ 10న ఉండగా అంతకు ముందు రోజు అంటే.. నవంబర్ 9న వుమెన్స్ టీ20 చాలెంజ్ ఫైనల్ జరుగుతుంది.
 
కోవిడ్ నేపథ్యంలో అసలు వుమెన్స్ టీ20 చాలెంజ్ జరుగుతుందా, లేదా అని సందేహించారు. కానీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ లీగ్ జరుగుతుందని ఆగస్టులో ఖరారు చేశారు. అందులో భాగంగానే ఆ లీగ్‌ను ఐపీఎల్‌తోపాటు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

తర్వాతి కథనం
Show comments