Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా గడ్డపై రికార్డ్ సృష్టించిన కోహ్లీ సేన.. భారీ నజరానా..

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (18:44 IST)
ఆస్ట్రేలియా గడ్డపై ఇంతకు ముందెప్పుడూ భారత్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోలేదు. సౌరవ్ గంగూలీ సేన మాత్రం ఓసారి సిరీస్‌ను డ్రా చేసుకుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ అరుదైన విజయాన్ని సాధించిన కోహ్లీ సేనకు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది.


టెస్టు జట్టులో ఆడిన క్రికెటర్లకు తలా రూ.15 లక్షలను నజరానాగా ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.60లక్షలు ఇవ్వనుంది. కోచ్‌లకు రూ.25లక్షల్ని నజరానాగా బీసీసీఐ అందించనుంది.
 
ఇదిలా ఉంటే.. ఆసీస్ గడ్డపై నెగ్గిన భారత జట్టు కివీస్‌తో సిరీస్‌కు రెడీ అవుతోంది. ఇంకా ఆస్ట్రేలియా, కివీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో ఆడే టీమిండియా జట్టులో ఫాస్ట్ బౌలర్ బుమ్రాకి విశ్రాంతి కల్పించారు.

బుమ్రా స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మజ్ సిరాజ్‌కు స్థానం లభించింది. అలాగే, కివీస్‌తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌లకి సిద్దార్థ్ కౌల్‌ని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments