Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై వేధింపుల కేసులో బంగ్లా క్రికెటర్ నిర్దోషి : కోర్టు తీర్పు

బాలికపై వేధింపుల కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షాదాత్ హుస్సేన్‌, ఆయన భార్య నృతో షాదాత్‌‌లకు ఊరట లభించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. గతేడాది హుస్సేన్ ఇంట్లో పనిచేసే

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (09:28 IST)
బాలికపై వేధింపుల కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షాదాత్ హుస్సేన్‌, ఆయన భార్య నృతో షాదాత్‌‌లకు ఊరట లభించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. గతేడాది హుస్సేన్ ఇంట్లో పనిచేసే బాలిక కంటికి గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఏడుస్తూ రోడ్డు పక్కన కూర్చున్న బాలికను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
 
బాలికను తీవ్రంగా హింసించిన నేరంపై హుస్సేన్, అతడి భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వారిద్దరూ రెండు నెలల తర్వాత వారు బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసులో నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 
 
కేసు విచారణ కొనసాగుతుండడంతో హుస్సేన్ దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పటివరకు 38 టెస్టులు ఆడిన హుస్సేన్ 72 వికెట్లు తీశాడు. 51 వన్డేల్లో 47 వికెట్లు పడగొట్టాడు. కోర్టు తీర్పుతో హుస్సేన్ ఆనందం వ్యక్తం చేశాడు. చివరికి సత్యమే గెలిచిందని పేర్కొన్న ఆయన, దేశానికి తిరిగి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments