భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం : ఒకరికి పాజిటివ్

Webdunia
గురువారం, 15 జులై 2021 (08:57 IST)
భారత క్రికెట్ జట్టులో కలకలం చెలరేగింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియ‌న్ టీమ్‌ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. మొత్తం 23 మంది క్రికెట‌ర్ల బృందంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. 
 
డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత 20 రోజుల బ్రేక్ దొర‌క‌డంతో ఈ గ్యాప్‌లో ప్లేయ‌ర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. ఆటగాళ్లు యూకేలో త‌లో దిక్కుకు వెళ్లారు. కొంద‌రు వివిధ ప్ర‌దేశాల‌ను చూడ‌టానికి వెళ్ల‌గా.. మ‌రికొంద‌రు యూరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు కూడా చూశారు. 
 
నిజానికి ప్లేయ‌ర్స్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా.. దాని నుంచి పూర్తి ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని, యూరో, వింబుల్డ‌న్‌లాంటి టోర్నీల‌కు వెళ్లొద్ద‌ని బీసీసీఐ చెప్పినా కొంద‌రు విన‌లేదు. అప్పుడే స‌ద‌రు ప్లేయ‌ర్ కొవిడ్ బారిన ప‌డ్డాడు. గురువారం టీమంతా డ‌ర్హ‌మ్ వెళ్ల‌నుండ‌గా.. ఆ ప్లేయ‌ర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్ల‌డం లేదు. 
 
డ‌ర్హ‌మ్‌లో టీమిండియా మ‌రోసారి బ‌యోబబుల్‌లోకి వెళ్ల‌నుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆగ‌స్ట్ 4న ప్రారంభ‌మ‌వుతుంది. ఒక ప్లేయ‌ర్ క‌రోనా బారిన ప‌డిన మాట నిజ‌మే. అయితే అత‌నికి పెద్ద‌గా ల‌క్ష‌ణాలేమీ లేవు. ప్ర‌స్తుతం అత‌డు క్వారంటైన్‌లో ఉన్నాడు. టీమ్‌తో కలిసి డ‌ర్హ‌మ్ వెళ్ల‌డం లేదు అని బీసీసీఐ అధికారి ఒక‌రు పీటీఐకి వెల్ల‌డించారు. అయితే, కరోనా వైరస్ సోకిన క్రికెట్ ఆటగాడి పేరు మాత్రం ఎవ‌రూ బ‌య‌ట‌పెట్ట‌లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments