టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ ధోని ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకొనే న్యూస్ను బీసీసీఐ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియాకు మెంటర్గా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిని నియమిస్తూ బీసీసీఐ అధికారిక ట్వీట్ ద్వారా ప్రకటించది. దీంతో ఫ్యాన్స్లో ఫుల్ జోష్ ఏర్పడింది.
యూఏఈ వేదికిగా అక్టోబర్ 17న టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. ఈ టోర్నమెంట్కు 15మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దానితోపాటు ఈ టోర్నమెంట్కు టీం ఇండియా మెంటర్గా మహేంద్రసింగ్ ధోనీని నియమించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించనుండగా, వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు.