Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ బ్లాస్టర్ తొలి డబుల్ సెంచరీకి 8 యేళ్లు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో వన్డేలు, టెస్టుల్లో కలుపుకుని 100 సెంచరీలు ఉన్నాయి. అలాగే, అత్యధిక పరుగుల రికార్డు, ఎన్నో ఘనతలను తన పేరిట లి

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (17:19 IST)
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో వన్డేలు, టెస్టుల్లో కలుపుకుని 100 సెంచరీలు ఉన్నాయి. అలాగే, అత్యధిక పరుగుల రికార్డు, ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఆ దిగ్గజ క్రికెటర్‌కు ఇంక ఏదో సాధించాలనే కసి. ఆరోజు కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశాడు. చివరికి అతని కల నెరవేరింది.
 
అది 2010 ఫిబ్రవరి 24. గ్వాలియర్‌లో సౌతాఫ్రికా, భారత్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా ఓపెనర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో సచిన్ వయసు 37 ఏళ్లు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడుతూ.. 50, 100, 150, 190.. ఇలా దాటుతుండగానే అభిమానులంతా టెన్షన్‌కు గురయ్యారు. 
 
ఔట్‌కాకుండా 200 పరుగులు చేయాలని మైదానంలోని ప్రతి అభిమాని తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు ఆడిన సచిన్ 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో వన్డేల్లో తొలిసారి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా క్రికెట్ దేవుడు సచిన్ చరిత్ర సృష్టించాడు. 
 
అభిమానులకు అభివాదం చేసిన సచిన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆరోజు సచిన్‌తో పాటు బ్యాటింగ్ చేసిన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ మైలురాయి సాధించడంలో మంచి సహకారం అందించాడు. అంతకుముందు వన్డేల్లో 194 అత్యధిక స్కోరు. ఆ తర్వాత భారత స్టార్ క్రికెటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు చూసి వారెవ్వా అనిపించిన విషయం తెలిసిందే. సచిన్ చేసిన ఈ తొలి డబుల్ సెంచరీకి నేటితో సరిగ్గా 8ఏళ్లు పూర్తయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

తర్వాతి కథనం
Show comments