Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధును చంపేసిన సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా : సెహ్వాగ్

బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా దేశాన్ని నిలువునా దోచుకోవడంలో ఆ ఇద్దరు మోడీలు, ఒక మాల్యాను మంచినవారు లేరు.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (14:40 IST)
బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా దేశాన్ని నిలువునా దోచుకోవడంలో ఆ ఇద్దరు మోడీలు, ఒక మాల్యాను మంచినవారు లేరు. వారు ఎవరో కాదు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా. ఈ ముగ్గురు కలిసి రూ.50 వేల కోట్లకుపైగా దోచుకున్నారు. 
 
ఇలాంటివారు విదేశాల్లో హాయిగా నిద్రపోతున్నారు. కానీ, ఆకలి కోసం చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసిన వాళ్ల‌ని మాత్రం జ‌నాలు చంపేస్తున్నారు. ఆక‌లి వేసి ఓ కేజీ బియ్యం దొంగ‌తనం చేసినందుకు మధు అనే వ్య‌క్తిని ఇటీవ‌ల దారుణంగా గాయ‌ప‌రిచి చంపేసిన విష‌యం తెలిసిందే. కొంత‌మంది విద్యావంతులు కూడా మ‌ధును ర‌క్షించ‌క‌పోగా.. గాయాల‌తో ఉన్న అత‌నితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
 
తాజాగా ఈ ఘ‌ట‌న‌పై సెహ్వాగ్ అస‌హ‌నం వ్య‌క్తంచేశాడు. మ‌ధును చంపేసిన స‌మాజంలో ఉన్నందుకు సిగ్గుప‌డుతున్నాంటూ ట్వీట్ చేశాడు. 'మ‌ధు కేవ‌లం ఒక కేజీ బియ్యం దొంగిలించాడు. అందుకే ఆ పేద గిరిజ‌న వ్య‌క్తిని ఉబైద్‌, హుస్సేన్‌, క‌రీమ్ అనే వ్య‌క్తుల‌తో కూడిన గుంపు చంపేసింది. ఇది స‌మాజానికి మాయ‌ని మ‌చ్చ‌. ఇంత ఉన్నత స‌మాజంలో ఈ ఘ‌ట‌న జ‌రిగినందుకు నేను సిగ్గుప‌డుతున్నాన‌ు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments