Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కూతురు జీవాను బెదిరించిన వ్యక్తి అరెస్ట్-రాంచీ పోలీసులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (12:06 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాను బెదిరిస్తూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పోస్టు చేసిన సంగతి తెలిసిందే . ఆ కేసులో పోలీసులు 16 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైన తర్వాత ధోనీ భార్య సాక్షి ధోనీ ఇన్‌స్టా అకౌంట్‌లో ఆ టీనేజర్ అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారు. 
 
జీవాను బెదిరిస్తూ అసభ్యకరమైన పోస్టు చేశాడు. అయితే ఆ పోస్టును చేసింది తానే అని ఆ టీనేజర్ అంగీకరించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. బెదిరింపు మెసేజ్‌కు సంబంధించిన అంశాన్ని కచ్ పోలీసులతో రాంచీ పోలీసులు షేర్ చేసుకున్నారు. 
 
కచ్ జిల్లాలోని ముంద్రా నుంచి ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. రాంచీ పోలీసులకు అతన్ని అప్పగించనున్నారు. జీవాను హెచ్చరిస్తూ ఆ టీనేజర్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

తర్వాతి కథనం
Show comments