Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత తొలితరం క్రికెట్ దిగ్గజం అలీ ఇకలేరు...

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (15:50 IST)
భారత తొలితరం క్రికెట్ దిగ్గజం, అంతర్జాతీయ క్రికెట్ వన్డే మ్యాచ్‌లలో భారత్ తరపున తొలి బంతి విసిరిన సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు. ఆయనకు వయసు 83 సంవత్సరాలు. హైదరాబాద్ నగరానికి చెందిన అలీ.. క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆయన బంధువు రెజా ఖాన్ వెల్లడించారు. అలీ మృతిపట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, 1964-74 మధ్యకాలంలో భారత జట్టుకు అలీ ప్రాతినిథ్యం వహించారు. 1974 జూలై 13వ తేదీన లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా తరపున తొలి బంతిని వేసిన క్రికెటర్‌గా చిరస్మరణీయమైన ఘనతను సొంతం చేసుకున్నారు. 
 
ఆయన 29 టెస్టుల్లో 1,018 పరుగులు చేయగా, ఇందులో ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి. మీడియా పేస్ బౌలర్ అయిన అలీ టెస్టుల్లో 47 వికెట్లు తీశారు. ఐదు వన్డేల్లో 93 పరుగులు చేసి ఏడు వికెట్లు తీశారు. 1975లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అదే ఆయన చివరి వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

Mangalsutra for Love: 93 ఏళ్ల వయస్సులో భార్య కోసం మంగళసూత్రం వీడియో వైరల్

తిరుమ‌ల‌ భ‌క్తులకు గుడ్ న్యూస్: భక్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

తర్వాతి కథనం
Show comments