Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత తొలితరం క్రికెట్ దిగ్గజం అలీ ఇకలేరు...

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (15:50 IST)
భారత తొలితరం క్రికెట్ దిగ్గజం, అంతర్జాతీయ క్రికెట్ వన్డే మ్యాచ్‌లలో భారత్ తరపున తొలి బంతి విసిరిన సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు. ఆయనకు వయసు 83 సంవత్సరాలు. హైదరాబాద్ నగరానికి చెందిన అలీ.. క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆయన బంధువు రెజా ఖాన్ వెల్లడించారు. అలీ మృతిపట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, 1964-74 మధ్యకాలంలో భారత జట్టుకు అలీ ప్రాతినిథ్యం వహించారు. 1974 జూలై 13వ తేదీన లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా తరపున తొలి బంతిని వేసిన క్రికెటర్‌గా చిరస్మరణీయమైన ఘనతను సొంతం చేసుకున్నారు. 
 
ఆయన 29 టెస్టుల్లో 1,018 పరుగులు చేయగా, ఇందులో ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి. మీడియా పేస్ బౌలర్ అయిన అలీ టెస్టుల్లో 47 వికెట్లు తీశారు. ఐదు వన్డేల్లో 93 పరుగులు చేసి ఏడు వికెట్లు తీశారు. 1975లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అదే ఆయన చివరి వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

9 మంది దొంగలు, ఒక్కడే కమాండర్: టీవీకె విజయ్

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments