ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.1, 2, 5, 10, 20 నాణేలు రోజువారీ చెలామణిలో ఉన్నాయి. కానీ, రూ.800, రూ.900 నాణేలను మీరు ఎక్కడా చూసివుండరు. ఎందుకంటే ఇవి దేశంలో ఎక్కడా చెలామణిలో లేవు. అయితే, ఈ నాణేలు ఎందుకు ముద్రించారన్నదే కదా మీ సందేహం.
సాధారణంగా పలువురు ప్రముఖుల స్మృతి చిహ్నంగా ఆర్.బి.ఐ చాలా కొద్ది సంఖ్యలో ఇలాంటి నాణేలను ముద్రిస్తుంటుంది. ఇలా ముద్రించిన నాణేలను ప్రత్యేకంగా అమ్మకానికి పెడుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ రూ.800, రూ.900 నాణేలను తెప్పించుకున్నాడు.
దేశంలో తొలిసారి విడుదలైన ఈ నాణేలను 2025, ఫిబ్రవరి 20వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న వాయిస్ తక్షణం ఆర్డర్ చేయగా, మార్చి 10వ తేదీన అందాయని వెల్లడించారు.
ఈ నాణేలను జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతి సందర్భంగా ఆర్.బి.ఐ ముంబై మింట్ ముద్రించింది. వెండితో తయారు చేసిన ఈ నాణేలు ఒక్కోటి 40 గ్రాముల బరువును కలిగివుంది. కాగా, కరెన్సీ సేకరించే హాబీ ఉన్న మహ్మద్ వాయిస్ వద్ద 170 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ ఉన్నట్టు ఆయన వెల్లడించారు.