Webdunia - Bharat's app for daily news and videos

Install App

#AmbatiRambabuకు రెండోసారి కరోనా పాజిటివ్.. మహమ్మారి రూటు మార్చేసిందా?

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం వైరస్ రూటుమార్చడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఒకసారి కరోనా సోకితే మళ్లీ వచ్చే అవకాశం లేదని అందరూ భావించారు. కానీ, కరోనా మహమ్మారి రెండోసారి కూడా పంజా విసురుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రెండోసారి కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
 
జూలైలో తనకు కోవిడ్ వచ్చి తగ్గిందని.. అయితే అసెంబ్లీ కోవిడ్ టెస్టు చేయించడంతో.. రిపోర్ట్స్‌లో పాజిటివ్ వచ్చింది. రీ ఇన్ఫెక్షన్‌కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో కోవిడ్‌ను మరోసారి జయించి మీ ముందుకి వస్తాను అంటూ.. అంబటి రాంబాబు పేర్కొన్నారు.
 
కాగా, ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు కూడా రెండోసారి కరోనా వచ్చింది. దీంతో ఆయన శాసనమండలి సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబుకు సైతం రెండోసారి కరోనా సోకింది. కరోనా మహమ్మారి ప్రజలపై ఇలా వరుసగా దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments