Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బిలాలు కుట్టాయి.. ఆస్పత్రిలో చేరిన సైంటిస్ట్.. కరోనా వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా?

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (17:28 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్‌లోనే పుట్టిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇవే వాదనలు వినిపించింది. కానీ చైనా మాత్రం అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేస్తూ వచ్చింది. అయితే ఆ అనుమానాలు, ఆరోపణలే నిజమని తాజాగా తేలింది. ఆ వుహాన్ ల్యాబ్‌లో ఉన్న సైంటిస్టులే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. 
 
ఓ గుహలో పరిశోధనలు చేయడానికి వెళ్లిన సమయంలో తమను కరోనా వైరస్ సోకిన గబ్బిలాలు కుట్టాయని వాళ్లు చెప్పారు. ఈ సంచలన విషయాన్ని తైవాన్ టైమ్స్ వెల్లడించింది. 2017లో ఈ ల్యాబ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఓ గుహలోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు వివరించింది.
 
ఇందులో ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ.. ఆ సమయంలో ఓ గబ్బిలం తాను చేతికి వేసుకున్న రబ్బర్ గ్లోవ్స్ లోపలికి వెళ్లి కుట్టినట్లు చెప్పారు. తాము ఆ గుహలో కొన్ని శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు. గబ్బిలాలపై చేతులకు కనీసం గ్లోవ్స్ లేకుండా పరిశోధనలు నిర్వహించామని, మాస్క్‌లు లేకుండా వైరస్‌లను పరీక్షించినట్లు కూడా ఆ ల్యాబ్ సిబ్బంది వెల్లడించడం గమనార్హం. 
 
ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రస్తుతం కరోనా మూలాల కోసం డబ్ల్యూహెచ్‌వోకు చెందిన 13 మంది సభ్యుల బృందంలో చైనాలోని వుహాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments