గబ్బిలాలు కుట్టాయి.. ఆస్పత్రిలో చేరిన సైంటిస్ట్.. కరోనా వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా?

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (17:28 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్‌లోనే పుట్టిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇవే వాదనలు వినిపించింది. కానీ చైనా మాత్రం అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేస్తూ వచ్చింది. అయితే ఆ అనుమానాలు, ఆరోపణలే నిజమని తాజాగా తేలింది. ఆ వుహాన్ ల్యాబ్‌లో ఉన్న సైంటిస్టులే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. 
 
ఓ గుహలో పరిశోధనలు చేయడానికి వెళ్లిన సమయంలో తమను కరోనా వైరస్ సోకిన గబ్బిలాలు కుట్టాయని వాళ్లు చెప్పారు. ఈ సంచలన విషయాన్ని తైవాన్ టైమ్స్ వెల్లడించింది. 2017లో ఈ ల్యాబ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఓ గుహలోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు వివరించింది.
 
ఇందులో ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ.. ఆ సమయంలో ఓ గబ్బిలం తాను చేతికి వేసుకున్న రబ్బర్ గ్లోవ్స్ లోపలికి వెళ్లి కుట్టినట్లు చెప్పారు. తాము ఆ గుహలో కొన్ని శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు. గబ్బిలాలపై చేతులకు కనీసం గ్లోవ్స్ లేకుండా పరిశోధనలు నిర్వహించామని, మాస్క్‌లు లేకుండా వైరస్‌లను పరీక్షించినట్లు కూడా ఆ ల్యాబ్ సిబ్బంది వెల్లడించడం గమనార్హం. 
 
ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రస్తుతం కరోనా మూలాల కోసం డబ్ల్యూహెచ్‌వోకు చెందిన 13 మంది సభ్యుల బృందంలో చైనాలోని వుహాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments