Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం
, ఆదివారం, 17 జనవరి 2021 (17:14 IST)
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 13మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. 
 
ఇజ్రాయెల్‌ పరిశోధకులు కరోనాను నియంత్రించేందుకు సరికొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని తీసుకున్న తర్వాత కనీసం 13 మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయి. ఆ దేశ ఆరోగ్య శాఖే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. 
 
''వ్యాక్సిన్ తీసుకున్న 28 గంటల వరకూ నేను ముఖ పక్షవాతంతోనే ఉన్నా'' అని ఓ వ్యక్తి చెప్పగా.. ఆ తర్వాత కూడా ఈ లక్షణాలు పూర్తిగా తగ్గలేదు అని మరో వ్యక్తి వెల్లడించారు.

అంతకుముందు జర్మనీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల వ్యవధిలో 10 మంది మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. గత డిసెంబర్ నుంచే వ్యాక్సినేషన్‌పై జర్మనీ విస్తృత ప్రచారం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిఫెన్స్‌లో ఉద్యోగాలు.. మొత్తం ఖాళీలు- 39