Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.. అంతే స్పృహతప్పి పడిపోయిన యువతి

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (09:41 IST)
కంట్లూరులో కలకలం రేగింది. ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా యువతిని ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్‌కు లక్ష్మీ ప్రసన్న (21) వెళ్లారు. ఫోన్ మాట్లాడుతూ ఆమెకు నర్సు పద్మ వెంట వెంటనే రెండు డోసుల వాక్సిన్స్ ఇచ్చారు. వాక్సిన్ అనంతరం కొద్దీ సేపటికే యువతి కళ్ళు తిరిగి పడిపోయారు.
 
వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి యువతిని తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నప్పటికి అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు అంటున్నారు. లక్ష్మీ ప్రసన్నకు ఏమి జరుగుతుందోనని కటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
 
విషయం వెలుగులోకి రావడంతో నర్సు నిర్లక్యంపై స్థానికులు మండిపడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నర్సు పద్మను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వెళ్లిన వారిని పట్టించుకోకుండా గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments