శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా.. వరంగల్ మేయర్ దంపతులకు కోవిడ్

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (10:15 IST)
కరోనా మహమ్మారి తెలంగాణలో శరవేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చుట్టేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఫలితం లేకుండా పోతుంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ నేతలను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ నేతల గన్‌మెన్స్, పిఏలకు ఇలా కరోనా సోకింది.
 
తాజాగా.. వరంగల్ మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో గన్‌మెన్‌తో పాటు సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు క్వారంటైన్‌లో ఉన్నారు. గత పదిరోజులుగా మేయర్‌తో కలిసి తిరిగిన, సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు టెస్ట్‌లు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కాగా.. మేయర్ దంపతులు ఎక్కడ వైద్యం తీసుకుంటున్నారనే విషయం తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం సిద్ధం

Poorna: పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన డార్క్ నైట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ !

సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో సర్కార్ బాయి పూజా కార్యక్రమం

Pooja Hedge: పెద్ది కోసం ఐటెం సాంగ్ చేసే స్థాయి హీరోయిన్ కోసం వేట

Hansika: గృహ హింస ఆరోపణలపై హన్సిక మోత్వాని పరువు నష్టం దావా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

తర్వాతి కథనం
Show comments