Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్: రెండు సార్లు టీకా వేసుకున్నా వదిలిపెట్టని కరోనావైరస్, ఎంతమందిని పట్టుకుందో తెలుసా?

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:59 IST)
రెండుసార్లు టీకా తీసుకున్న వారినీ కొవిడ్‌ వదలడం లేదు. వరంగల్‌లో ఇలాంటి కేసులు ఇటీవల వెలుగుచూస్తున్నాయి. వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు రెండు విడతలు టీకా తీసుకున్నా మళ్లీ కరోనా బారిన పడ్డారు. కీర్తినగర్‌ యూపీహెచ్‌సీల్లో నాలుగు రోజుల కిందట 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

అందులో రెండోవిడత టీకా తీసుకున్న ఏడుగురికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. కొత్త విషయమేమిటంటే టీకా తీసుకున్నవారికి కొవిడ్‌ పాజిటివ్‌ వస్తే అధికారులు పాజిటివ్‌ రిపోర్టు చేతికి ఇవ్వడం లేదు. చరవాణికి సంక్షిప్త సందేశాన్నీ పంపడం లేదు. ఆరా తీస్తే వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి పాజిటివ్‌ వస్తే పోర్టల్‌లో తీసుకోవడం లేదని సిబ్బంది అంటున్నట్లు బాధితులు తెలిపారు.

పాజిటివ్‌ రిపోర్టు ఇస్తేనే అధికారులు సెలవు మంజూరు చేస్తామంటున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి మాట్లాడుతూ.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. టీకా వేయించుకుంటే వంద శాతం వైరస్‌ సోకదని చెప్పలేమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments